చంద్రబాబు మీద దాడికి కుట్ర..!!

కేంద్రం 'ఆపరేషన్‌ గరుడ' పేరుతో భారీ కుట్ర చేస్తుందని ఆరోపించి అప్పట్లో సంచలనం రేపిన హీరో శివాజీ.. మరోసారి కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.. చంద్రబాబును సీఎం పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.. ఆదినుంచీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వం, అందుకోసం రూపొందించిన ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

ఒక ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం భావితరాలను ఇబ్బంది పెట్టడమే.. నిన్న అర్ధరాత్రి నాకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది.. జాతీయస్థాయిలోని రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం చంద్రబాబుకు నోటీసులు వస్తాయి.. ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.. ప్రస్తుతం విషయం బయటపడింది కాబట్టి నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని అన్నారు.. ఈ స్థానంలో జగన్‌ ఉన్నా, నా ఆందోళన ఇలాగే వ్యక్తం చేస్తా అని చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన కేంద్రం మరోటి లేదన్నారు.. సీఎంను ఇబ్బంది పెట్టడమంటే భావితరాలకు నష్టం చేయడమేనని వ్యాఖ్యానించారు.. బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారని విమర్శించారు.. అలాగే తనకు కొన్ని రాజకీయ పార్టీల నుండి ప్రాణ హాని ఉందని శివాజీ తెలిపారు.