సింగర్ ను కాల్చి చంపేశారు...!


ఆమె ఓ సింగర్. అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. ఈ దారుణమైన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 20 ఏళ్ల హర్షితా దాహియాది సోనీపట్ దగ్గర ఉన్న మొహమ్మద్ పూర్ గ్రామం సొంత ఊరు... ఆమె ఓ ఫేమస్ ఫోక్ సింగర్. 'రాగిణి' సాంగ్స్ పాడుతూ, ఈమె చేసే నృత్యాలు హర్యానాలో ఎంతో ఫేమస్. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ పరిధిలోని నారెల్లాలో ఓ ప్రదర్శన ఇచ్చిన ఆమె, తిరిగి తన ప్రాంతమైన పానిపట్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ కారు నడుపుతుండగా.. సందీప్, నిషా అనే మరో ఇద్దరు స్నేహితులు కూడా ఆమె కారులో ఉన్నారు.  అయితే ఆమె కారును ఓవర్ టేక్ చేసిన దుండగులు.. వారిని దిగాలని హెచ్చరించారని.. ఆమెపై తుపాకీతో విరుచుకుపడ్డారని పోలీసులు తెలిపారు. ఏకంగా నాలుగు బులెట్లు ఆమె శరీరంలోకి చొచ్చుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా... ఆమె చనిపోక రెండు గంటల ముందు కూడా ఫేస్బుక్ లో లైవ్ లోనే ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. తనకు బెదిరింపులు వస్తున్నాయని, చంపుతామని అంటున్నారని ఇటీవల హర్షిత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు, వీడియోలు పెట్టడం గమనార్హం.