సీమాంధ్ర నేతలు టెర్రరిస్టులు....

 

 

 

సీమాంధ్ర నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్ర నాయకులు పార్లమెంటును తగలబెడతమని టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుక్షణం అడ్డుపడాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆటంకాలు సృష్టించాలని చూస్తున్న సీమాంధ్ర నాయకులపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజిపి.ప్రసాదరావు సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నాయకులపై కేసులు నమోదు చేసిన ప్రసాదరావు...సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు సుమోటో కేసు పెట్టడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి తెలంగాణ ప్రజలు పక్షాన నిలిచారని అన్నారు. తెలంగాణకు అడ్డుపడితే తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో ఊహించుకోవాలని అన్నారు.