Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలవరం ముసుగులో దోపిడీకి కుట్ర: హరీష్
posted on: May 30, 2014 11:09AM
.jpg)
పోలవరం ముసుగులో తెలంగాణలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు ఇద్దరు నాయుడులు కుట్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడు మండలాలు సీమాంధ్రలో కలపడంవల్ల తెలంగాణకు యేడాదికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ఈ ప్రాంత టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన అర్డినెన్స్ విధానాన్నే బీజేపీ అమలు చేసిందని ఆ పార్టీ నేతలు పేర్కొనడాన్ని హరీశ్రావు తప్పుబట్టారు. ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ అయితే, బీజేపీ ఆపొచ్చు కదా..? అని ఆయన ప్రశ్నించారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆగమేఘాల మీద ఎందుకు అర్డినెన్స్ తీసుకువచ్చారో ఆ పార్టీ నేత కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


.jpg)



