ఏకంగా బెదిరింపులకే దిగారుగా..!

 

మీకు అమరావతి ఎందుకు, మయసభ కట్టుకుంటారా అని గతంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా బెదిరింపు చర్యలకే దిగుతున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే, ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తాం అంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్న నేపథ్యంలో అలా ఎన్నికలు ముగిశాయో లేదో అప్పుడే తమ నోటికి పని చెప్పారు. ముఖ్యంగా జీవీఎల్ నర్సింహారావు అయితే కాస్త ఎక్కువే మాట్లాడారు.  కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నామని, ఎడ్యూర‌ప్ప‌పై ఏ అభియోగాలు లేవ‌ని, ఆయన చాలా క్లీన్ అని, అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసాం అంటూ, చెప్పుకొచ్చిన ఆయన.. ఆంధ్రాలో రాబోయే ఆరు నెల‌ల్లో భాజ‌పాకి మ‌హ‌ర్ద‌శ రాబోతోంద‌ని..ఆంధ్రప్రదేశ్ లో, కొన్ని రోజుల్లోన్నే అనూహ్య పరిణామాలు ఉంటాయని... ఆంధ్రప్రదేశ్ ని ఏలేది మేమే అంటూ, జోస్యం చెప్పారు.రాజకీయంగా అన్ని పార్టీలు, ఈ అనూహ్య పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా విపరీత వ్యాఖ్యలు చేసారు... చంద్రబాబు నాయుడు అవినీతి చేసారని, దాని అంతు చూస్తాం అంటూ పాత పాటే పాడారు.. కర్ణాటక రాష్ట్రంలో భాజ‌పా అధికారంలోకి వ‌చ్చాక సిద్ధరామయ్య పై విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. ఎడ్యూర‌ప్ప జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన అవినీతిప‌రుడు అయిపోతారా అంటూనే, జగన్ కూడా ఇదే బాపతు అనే విధంగా, మాట్లాడి వీరి బంధాన్ని బయట పెట్టారు..