గుంటూరు క్వారీలో బ్లాస్టింగ్‌.. చంద్రబాబు దిగ్భ్రాంతి..

 

గుంటూరుజిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్‌ క్వారీలో అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో బండరాళ్లు మీదపడి బండరాళ్లు పడి ఆరుగురు కూలీలు మృతిచెందారు. మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారీ ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌, రూరల్‌ ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులను సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.