గుండు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరైన బ్రహ్మానందం

ప్రముఖ హాస్యనటుడు గుండు హానుమంతరావు ఇవాళ తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. గుండు మరణవార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మిత్రుడు బ్రహ్మానందం.. గుండు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తనను ఎంతో అప్యాయంగా బావా అని పిలిచే గుండు ఇక లేరంటే నమ్మలేకుండా ఉన్నారన్నారు. హనుమంతరావుతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. పరిశ్రమలో తనకున్న అతికొద్దిమంది మిత్రుల్లో గుండు హనుమంతరావు ఒకరని.. కొద్దిరోజుల క్రితం తన ఇంటికి వచ్చిన ఆయన ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉందని చెప్పారు.