ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..

 

ఆంధ్ర‌-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కలకలం రేగింది. వివరాల ప్రకారం.. ఆంధ్ర‌-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ప‌న‌స‌పుట్టు వ‌ద్ద ఈ రోజు ఆ ప్రాంత‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నామినేష‌న్ పత్రాల‌ను ప‌రిశీలించ‌డానికి ప్ర‌భుత్వ‌ అధికారుల బృందం అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో అక్క‌డికి ప్ర‌వేశించిన‌ మావోయిస్టులు వారిని అప‌హ‌రించారు. అప‌హ‌ర‌ణ‌కు గుర‌యిన వారిలో గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం జేఈ స‌హా ఆరుగురు ప్ర‌భుత్వ అధికారులు ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.