ఏపీలోని పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్

ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా, సిద్ధమయ్యే విధంగా ఇంటి వద్ద నుంచే క్లాసులు వినేలా పదో తరగతి విద్యార్థుల కోసం ఆంధ్ర ప్రదేశ్ లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధ్వర్యంలో రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్ పాఠాలను బోధించనున్నారు. పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన క్లాసులను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు. కాగా, ఛానల్‌లో ప్రసారమయ్యే క్లాసులను విద్యార్ధులు తప్పనిసరిగా ఫాలో కావాలని అధికారులు సూచిస్తున్నారు.