భయపడుతున్న గంటా.. అందుకే జనసేనలోకి

టీవీలో ఛానల్ మార్చినంత ఈజీగా ఈ మధ్య రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు.. ప్రజలకు కూడా ఈ వార్తలు వినీ వినీ అలవాటైపోయింది.. అయితే తాజాగా మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వదిలి జనసేనలో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. టీడీపీ తనని కావాలనే పరోక్షంగా దూరం పెట్టాలని చూస్తుందని భావించిన గంటా, టీడీపీ మీద అసహనంతో జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది.. గంటాకి ప్రజల నాడి అంచనా వేయడం, రాజకీయ పార్టీలు మారడం కొత్తేమి కాదు.. టీడీపీ తరుపున ఎంపీగా చేసిన గంటా, తరువాత ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌లో విలీనం అయిన తరువాత మంత్రిగా చేసారు.. తరువాత మళ్ళీ టీడీపీలోకి వచ్చి ప్రస్తుతం మంత్రిగా చేస్తున్నారు.. రాజకీయాలను అంచనా వేయడంలో దిట్ట అయిన గంటా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో జనసేన మూలంగా తను ఓడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి, జనసేన తరుపున పోటీ చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నారట.. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.