దాడికి దిగుతున్న ఖాకీలు 

 

ప్రజల రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఖాకీలది. అలాంటి ఖాకీలే దాడికి దిగిన రెండు వేరు వేరు సంఘటనల్లో ఒక మహిళ , మరొక డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వివరాలలోకి వెళ్తే కడప జిల్లా గంగవరం గ్రామానికి చెందిన మహిళపై ఓ స్థల వివాదంలో తలదూర్చిన ఎస్సై దాడి చేసాడు. ఆ దాడితో మనస్థాపానికి గురైన మహిళ విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి మరీ విషమించటంతో పోలీసులే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో వాహన తనికీల్లో భాగంగా ఓ టాటా ఏస్ వాహనాన్ని ఆపి రికార్డ్స్ పరిశీలించిన ఎస్సై అన్నీ సక్రమంగా ఉండటంతో యూనిఫామ్ లేదనే సాకుతో దుర్భాషలాడి ఆ డ్రైవర్ని చితకబాదాడు. బలమైన గాయాలు అవ్వటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడికి కారణం అయిన ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు.