అమెరికాలో కాల్పుల కలకలం...17 మంది విద్యార్థులు మృతి


ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్ప్రతికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కాల్పులకు పాల్పడింది. అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్‌ క్రూజ్‌ (19)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నికోల‌స్‌ను కొద్దిరోజుల క్రితం యాజ‌మాన్యం స‌స్సెండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌ను సస్పెండ్‌ చేశారన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. 

 

ఇక ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.