ఎంసెట్ 2013 ఫలితాలు విడుదల
posted on Jun 5, 2013 4:51PM
ఎంసెట్ 2013 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని జేఎన్ఏఎఫ్యూలో ఉప ముఖ్యమంత్రి, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 76 వేల 995 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2 లక్షల 1వేయి 308 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ లో 72.67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెడికల్ లో 80.79 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన 50వేల ఇంజనీరింగ్ సీట్లు. ప్రకాశం జిల్లా పొదిలి కి చెందిన సాయి సందీప్ రెడ్డి కి ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్. మెడికల్ విభాగంలో హైదరాబాద్ లోని రామచంద్రపురానికి చెందిన వెంకట్ వీనిత్ మొదటి ర్యాంక్ సాధించాడు. విజయవాడకు చెందిన రోహిత్ కు రెండో ర్యాంక్, జగదీశ్ రెడ్డికి మూడో ర్యాంక్.