మందు కొడుతున్న చేపలు...

 

చేపలు మందు కొడుతున్నాయి. చేపలు ఏంటి మందు కొట్టడమేంటి అనుకుంటున్నారా... అవునండీ.. మీరు విన్నది నిజమే. చేపలు మందు కొడుతున్నాయి. మందు లేనిదే దాణా లేదు అంటున్నాయి. ఈ విచిత్రమైన ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడి చేపల చెరువుల రైతులు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇప్పుడిది హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. ఈ మధ్య చేపల దాణాలో మందు కలిపి పెడితే మంచి ఫలితాలు ఉంటాయని విన్నారట. ఓ సారి ట్రై చేసి చూద్దా అని వారు కూడా ప్రయత్నించారట. ఇంకేముంది 100% రిజల్ట్ వచ్చింది. చేపలు ఏంచక్కా దాణా తినడమే కాదు.. ఎదుగల కూడా తొందరగా ఉందట. మంచి కండ పట్టి.. పెరగాల్సిన దాని కన్నా ఎక్కువగానే పెరుగుతున్నాయట. దీంతో ఇదేదో బావుంది కదా అని.. మరిన్ని పెద్ద చెరువుల్లో ప్రయోగం చేశారట. అక్కడ కూడా క్లిక్ అయింది. దీంతో చేపలు సాగుచేసే రైతులు.... కేవలం వాటికోసం కేసుల కొద్ది మందు బాటిళ్లు కొని.. వాటిని చేపల దాణాలో కలిపి వేస్తున్నారట. దీంతో చేపలు రెండు గంటల్లో తిన్నాల్సిన దాణా కాస్త.. ఒక్క గంటలో తినేస్తున్నాయట. అందుకే పెరుగుదల ఎక్కువగా ఉంటుందట. మొత్తానికి చేపల చెరువుల మీద ఇప్పటివరకూ ఎన్నో ప్రయోగాలు చేశారు... అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఈ మందు కిక్కు మాత్రం చేపలకు బాగా నచ్చినట్టు ఉంది. మందు కొట్టి.. రైతులకు లాభాల్ని ఇస్తున్నాయి..