ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు..పేల్చేస్తాం...


ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈరోజు ఉదయం 10.54 నిమిషాల సమయంలో హైకోర్టును పేల్చేస్తామని  పోలీసు కంట్రోల్ రూమ్ కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో  కోర్టు దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. బాంబు స్కాడ్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. అయితే ఈ బెదిరింపు ఫోన్ కాల్ ఫేక్ అని తేల్చేశారు పోలీసులు. ఢిల్లీలోని భజన్‌పురా నుంచి కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ఫోన్ నెంబర్ మాత్రం యూపీకి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. ఫోన్ కాల్ వచ్చిన మరుక్షణం నుంచే ఆ ఫోన్ స్విచ్ఛాప్ వస్తుందని పోలీసులు తెలిపారు.