ఢిల్లీలో హై అలర్ట్... ఉగ్రవాదుల చొరబాటు..


ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం.. మన సైన్యంలోని సుబేదార్, కెప్టెన్ ర్యాంకుల దుస్తులు ధరించిన.. ఏడుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘా వర్గం హెచ్చరించింది. చక్రి, గురుదాస్ పూర్ బోర్డర్ పోస్టుల సమీపంలో మన ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు కనిపించారని అమృత్ సర్ నుంచి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయం, డొమెస్టిక్ టెర్మినల్, మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉన్న  ప్రాంతాలను అప్రమత్తం చేశారు. త్వరలో రిపబ్లిక్ డే రానున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.