ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

 

 

సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఈ రాజు కన్ను మూసారు. ఆమె వయసు 81 సంవత్సరాలు.  పంజాబ్ రాష్ట్రం లోని కపుర్తలలో 1938 మార్చి 31న షీలా దీక్షిత్ జన్మించారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ  సీఎంగా 15 ఏళ్ల పాటు  ఆమె బాధ్యతలను నిర్వహించారు.  వ్యవహరించారు. కొంత కాలం ఆమె కేరళ గవర్నర్ గా కూడా ఆమె పని చేశారు. ఈ రోజు ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటలకు షీలా దీక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె మృతికి అన్ని పార్టీలకు చెందిన పలువురు నేతలు సంతాపం తెలిపారు.