సైనికులతో మోడీ దీపావళి వేడుకలు

దీపావళి పర్వదినాన్ని ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని గురేజ్ వ్యాలీకి చేరుకున్న ఆయనకు సైనికులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని జవాన్లకు మిఠాయిలు అందించారు. సుమారు రెండు గంటలపాటు వారితో గడిపిన మోడీ సైనికుల్లో స్పూర్తిని నింపారు. మీతో గడపటం తనకు నూతన శక్తిని ఇచ్చిందని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతీకూల వాతావరణంలోనూ దేశ భద్రత కోసం జవాన్లు నిర్వర్తించే బాధ్యత ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైనికులతో దీపావళి జరుపుకోవడం ఇది నాలుగోసారి.