సీట్ల కోసం సీపీఐ ఆత్మహత్య

 

ఎట్టకేలకు కూటమి పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి.నిన్నా,మొన్నటి వరకు 5 స్థానాలకు పట్టుబట్టిన సీపీఐ ఎట్టకేలకు కాస్త రాజీకొచ్చింది.3 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పుకుంది.తాజాగా అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది.హుస్నాబాద్‌ నుంచి చాడా వెంకటరెడ్డి, వైరాలో బానోతు విజయబాయి, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేష్‌ బరిలోకి దిగనున్నారు. కేటాయించిన మూడు సీట్ల నుంచి సీపీఐ బరిలోకి దిగుతుందని పార్టీనేత పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు.తమ పార్టీ అభ్యర్థులు 17,18 తేదీల్లో నామినేషన్లు వేస్తారని వెంకటరెడ్డి వెల్లడించారు.మూడు సీట్ల కోసం సీపీఐ ఆత్మహత్య చేసుకొందని సీపీఎం నేత తమ్మినేని వ్యాఖ్యానించడాన్ని కొట్టి పారేశారు. ఎన్నికల తర్వాత ఎవరు ఆత్మహత్య చేసుకుంటారో తెలుస్తుందన్నారు.మహాకూటమికి ఆదరణ పెరిగిందన్న పల్లా వెంకట్‌రెడ్డి తమకు కేటాయంచిన మూడు సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపార్టీలో తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసే బాధ్యత ఆయా పార్టీలదే అని చెప్పారు.