ఏపిలో 143, తెలంగాణలో 154కు పెరిగిన క‌రోనా కేసులు!


తెలంగాణ లో ఇప్పటి వరకు154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు కొత్తగా 27 కోవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.  అయితే ఈరోజు మరో ముగ్గురు ఆసుపత్రి నుండి డిచ్ఛార్జ్ అయ్యారు. దీంతో 17 మంది కోలుకొని ఇళ్ల‌కు వెళ్ళారు. మిగ‌తా 128 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణాలో క‌రోనా కాటుకు తొమ్మిది మంది మృతి చెందారు. 

నల్గొండ జిల్లాలో ఆరుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీరిలో నల్గొండ పట్టణానికి చెందిన ఐదుగురు ఉండగా.. మిర్యాలగూడకు చెందిన ఓ మహిళ ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోనూ ఒకే రోజు ఆరు కరోనా కేసులు బయటపడ్డాయి.   

ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరింది. గత 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో 32 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.  దేశవ్యాప్తంగా చూస్తే కరోనా కేసుల సంఖ్య 2069కి పెరిగింది. భారత్‌లో మొత్తం క‌రోనా బారిన పడి 53 మంది  మృతి చెందారు.