కరోనా కేసుల్లో ఆసియాలోనే అగ్రస్థానంలో భారత్

ఒకవైపు ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చుకుంటూ పోతుంటే.. మరోవైపు కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,392 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కి చేరింది. అంతేకాదు, కరోనా కేసుల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక, గత 24 గంటల్లో కరోనాతో 230 మంది మరణించారు. దీంతో, మృతుల సంఖ్య 5,394కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 91,819 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 93,322 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.