వికెట్ నెంబర్ 6.. టీఆర్ఎస్ లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

 

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సుక్కు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియ కాంగ్రెస్ వీడనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు వీరి బాటలోనే ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయిన ఉపేందర్ రెడ్డి త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉపేందర్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు.