పాదయాత్ర అంటే ముద్దులు,సెల్ఫీలు

 

వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న పాదయాత్రపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి  సెటైర్లు వేశారు.పాదయాత్ర అంటే రోజూ రూ. 2 కోట్ల ఖర్చు, నెత్తిమీద ముద్దులు, సెల్ఫీలు అని తులసి రెడ్డి ఎద్దేవాచేశారు.పాదయాత్ర వల్ల రాష్ట్రానికి ఇప్పటి వరకు, రాబోయే రోజుల్లో ఒరిగే ప్రమోజనం ఏంటి? అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జగన్‌ను, వైసీపీ నేతలను ప్రశ్నిస్తోందని తులసి రెడ్డి అన్నారు.జగన్ పాదయాత్ర వలన ప్రత్యేక హోదా వస్తుందా?, కేంద్రం నుంచి రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రావాల్సిన రూ. 12వేల కోట్లు వచ్చాయా? విభజన చట్టంలో సెక్షన్ 46, సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 23,300 కోట్లు వస్తాయా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయా? రాజధానికి నిధులు అదనంగా వస్తాయా? ఏపీకి రావాల్సినవి ఏమైనా సరే జగన్ పాద్రయాత్ర వల్ల వస్తాయా? అని తులసి రెడ్డి జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇవన్నీ కేంద్రమే ఇవ్వాలని, ఈ సమస్యలపై పార్లమెంట్ బయట, లోపల పోరాడాలని తులసి రెడ్డి అన్నారు. ఎంపీలు రాజీనామా చేసి, పార్లమెంట్‌లో పోరాడే అర్హత కోల్పోయారని, అసెంబ్లీని బహిష్కరించి... అక్కడ మాట్లాడే అర్హత కూడా కోల్పయారని తులసి రెడ్డి విమర్శించారు.రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌కు లేదన్నారు.