ఉత్కంఠ: యూపిఎ సమావేశం ప్రారంభం

 

 congress cwc meeting, telangana congress

 

 

ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో యూపిఎ సమన్వయ కమిటీ భేటి ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, షిండే చిదంబరం, అజిత్ సింగ్ హాజరయ్యారు. అంతకముందు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు టివిలకు అతుక్కుపోయారు. రాష్ట్ర పరిణామాల పైన ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న తమ బంధువుల నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.