కాంగ్రెస్‌లో ఉల్లి లొల్లి

 

కాంగ్రెస్ నాయ‌కుడు క‌పిల్ సిబాల్ ఉల్లిపాయ‌ల ధ‌ర‌లపై చేసిన స్టేట్‌మెంట్‌తో దూమారం లేవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చ‌ర్యల‌కు దిగింది. ఉల్లి ధ‌ర‌లు పెరిగితే వ్యాపారుల‌ను అడ‌గాలిగాని ప్రభుత్వానికి ఏం సంబందం అంటు కపిల్‌సిబాల్ చేసిన వ్యఖ్యాల‌పై ఇత‌ర పార్టీల‌తో పాటు సామాన్యుల కూడా భ‌గ్గుమ‌న్నారు.

దీంతో దిద్దుబాటు చ‌ర్యల‌కు దిగిన కాంగ్రెస్ రెండు, మూడు వారాల్లో త‌గ్గుతాయ‌ని కేంద్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి శ‌ర‌ద్‌ప‌వార్ హామి ఇచ్చారు.మ‌హారాష్ట్రతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో పండించిన కొత్త పంట మార్కెట్‌లోకి వ‌స్తుంద‌ని త‌రువాత ధ‌ర‌లు నియంత్రణ‌లోకి వ‌స్తాయ‌ని ప‌వార్ చెప్పారు.