సీఎం రమేష్, విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు!!

 

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత సీఎం రమేష్ లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరపడం ఆకర్షించింది. తొలుత సీఎం రమేష్ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకొని కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు. తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేష్ పక్కన కూర్చొన్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించారు. కాగా సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని విలేకర్లు అడగగా ‘‘మీ హయాంలో ఏమేం చేశారో చెప్పమని రమేష్ ను అడిగాను’’ అని బదులిచ్చారు.