సీఎం ఢిల్లీ టూర్ తెలిసి..బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

 

 

cm kiran delhi, telangana issue, student died, telangana student died

 

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాల్లో ఉన్న విట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం స్టూడెంట్ కడవెండి నీరజ్ భరద్వాజ్ బాత్రూంలోకి వెళ్లి డీజిల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొవడంతో, అతనిని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలు పెద్దవి కావడంతో పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చికిత్స పొందుతూతుది శ్వాస విడిచాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్తున్నారని మీడియా ద్వారా తెలిసిందని, అదే రోజు ఆత్మ బలిదానానికి సిద్ధపడితే దాని ప్రభావం అధిష్టానంపై ఉంటుందనే భావనతోనే భరద్వాజ్ ఆత్మహత్యకు పూనుకున్నట్లు తనతో చెప్పారని టిఎంయు నేత బాబు తెలిపారు.


భరద్వాజ్ నూ  పరామర్శించడానికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎంజీఎం ఆస్పత్రి ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదుట విద్యార్థులు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. ఒక పోలీసు జీపు, రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు.