కేసీఆర్ మొక్కులపై హైకోర్టులో కేసు వేస్తాం-శశిధర్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ దేవుళ్లకు చెల్లించిన మొక్కులు చట్టవిరుద్ధమన్నారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. శ్రీవారికి సమర్పించే కానుకలకు ప్రభుత్వ ధనాన్ని వాడటం సమంజసం కాదన్నారు. ఆయన ఇచ్చిన మొక్కుకు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం సరికాదన్నారు. ఆదాయం ఎక్కువగా ఉండే ఆలయాల నుంచి సేకరించి కామన్ గుడ్ ఫండ్‌ను..శిథిలావస్థలో ఉన్న ఆలయాలను బాగు చేయడానికి ఉపయోగించాలని..అంతేకాని ప్రపంచ ప్రఖ్యాత తిరుమల దేవస్థానానికి కోట్లాది రూపాయలతో ఆభరణాలను చేయించడం చట్ట విరుద్ధమని ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.