అలక పాన్పు ఎక్కిన అఖిలప్రియ...


 

నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో రోజుకో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భూమా కుటుంబానికి, శిల్పా కుటుంబానికి మధ్య ఉన్న విబేధాల వల్ల ఆఖరికి శిల్పా బ్రదర్స్ పార్టీనే మారాల్సి వచ్చింది. ముందు అన్న పార్టీ మారగా.. ఇటీవలే తమ్ముడు శిల్పా చక్రపాణి వైసీపీ కండువా కప్పుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. భూమా నాగిరెడ్డి కుటుంబానికి గంగుల కుటుంబానికి మధ్య కూడా విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే  గంగుల కుటుంబంలోని కీలక నేత ప్రతాప్ రెడ్డి, నిన్న చంద్రబాబును కలిశారు. దీంతో ఆయన కూడా టీడీపీ లో చేరనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ను గంగులకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక దీనికి గాను అఖిలప్రియ అలక బూనినట్టు తెలుస్తోంది. నిన్న నంద్యాల ఉప ఎన్నికల్లో హీరో బాలకృష్ణతో కలసి ప్రచారంలో పాల్గొన్న ఆమె, గంగుల, చంద్రబాబు భేటీ విషయం తెలియగానే, ప్రచారం నుంచి వెళ్లిపోయి, తన అనుచరులతో భేటీ అయినట్టు సమాచారం. మరి చూద్దాం.. చంద్రబాబు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఇస్తారా..?అఖిల ప్రియ అలకను తీరుస్తారా..? ఏం జరుగుతుందో..