బ్రిడ్జి మీద నుండి దూకితే మోడీ స్కార్పియో....దూకుతున్న వ్యక్తిని పట్టుకున్న సినీ నటుడు !

 

బ్రిడ్జ్ పై నుండి దూకితే మోడీ స్కార్పియో ఇస్తాడని చెబుతూ ఒక వ్యక్తి పీవీ ఎక్స్ ప్రెస్ వే మీద నుండి కిందకి దూకే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ బ్రిడ్జి మీద నుండి దూకితే మోడీ స్కార్పియో ఇస్తాడని తాను పేపర్లో చదివానని అందుకే దూకుతున్నానని ఓ మతిస్థిమితం లేని యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారు. అయితే బ్రిడ్జి పై నుండి అతను దూకుతున్న విషయాన్ని గ్రహించిన పక్కనే ఉన్న సేలేబ్రిటీ జిమ్ నిర్వాహకుడు, ప్రముఖ సినీ నటుడు ఇంద్రసేన అతన్ని వ్యూహాత్మకంగా మాట్లాడాడు. అతను దూకితే కాపాడలేమని గ్రహించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న యువకులను అప్రమత్తం చేశారు. 

దీంతో బ్రిడ్జి కింద వారు గుమిగూడి రాళ్లు, కర్రలతో బెదిరిస్తూ అతడిని కిందికి దూకొద్దని హెచ్చరించారు. మరో యువకుడితో కలిసి బ్రిడ్జి మీదకు బైక్ వేసుకుని వెళ్ళిన నటుడు ఇంద్రసేన వెనక నుంచి వెళ్లి కిందకిలాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మతిస్థితిమం సరిగాలేదని తెలుస్తోంది. అతను ఆకలిగా ఉందని చెప్పడంతో ఇంద్రసేన భోజనం పెట్టించారు. ఆ తర్వాత తేరుకున్న యువకుడు తన వివరాలేమి చెప్ప లేదు తాను వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయాడు. అతని మాటలను బట్టి అతడు నార్త్ ఇండియన్ గా తెలుస్తుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. జిమ్ లో కసరత్తులు చేసుకుంటున్న ఇంద్రసేనా సరైన సమయంలో స్పందించి జిమ్ లో ఉన్న కుర్రాళ్లను అప్రమత్తం చేయడంతో అతని ప్రాణాలు నిలిచాయి. మతిస్థిమితం లేక ఆ యువకుడు దూకి ఉంటే దుర్మరణం పాలయ్యేవాడు.