దాని వెనుక ఉద్దేశ్యం వేరే ఉంది

గత కొన్ని రోజులుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న సినీనటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి మళ్లీ యాక్టివ్ అయ్యారు. తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీని ప్రభుత్వం ఖాళీ చేయిస్తుండటంపై ఆయన స్పందించారు. ఆ కాలనీని ఖాళీ చేయించడం వెనుక అసలు కారణం వేరే ఉందని చిరు ఆరోపించారు. నగరం నడిబొడ్డున ఆ కాలనీ ఉండటం ఇష్టం లేకే ఖాళీ చేయిస్తున్నారని, అభివృద్ధి పేరిట ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారని చిరంజీవి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.