జవాన్ల కుటుంబాలకు పరిహారం..

 

ఛత్తీస్‌గఢ్ సుక్మాజిల్లాలో మావోయిస్టులు కాల్పులు జరిపి 25 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో చనిపోయినవారిలో  నలుగురు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. అయితే తమ జవాన్ల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ. 20 లక్షలను పరిహారంగా ప్రభుత్వం ప్రకటించింది.