టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నాం - చంద్రబాబు

 

ముందస్తుతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.. ఓ వైపు టీఆర్ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల హీట్ పెంచితే.. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ పార్టీలు మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి.. అయితే ఇలాంటి సమయంలో తెలంగాణలో ఎన్నికల గురించి, పొత్తుల గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నామని అన్నారు.. అయితే, తెలుగు రాష్ట్రాలు కలిస్తే బలపడతాయని భావించిన బీజేపీ.. టీఆర్ఎస్‌, టీడీపీ కలవకుండా అడ్డుకుందని ఆరోపించారు.. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం తగువులు పెడుతోందని మండిపడ్డారు.. అదేవిధంగా టీడీపీని దెబ్బతీయడం, ఏపీకి అన్యాయం చేయడమే బీజేపీ ఉద్దేశం అని ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.