చంద్రబాబు మేనల్లుడు ఉదయ్‌కుమార్‌ మృతి

 

చంద్రబాబు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు ఉదయ్‌కుమార్‌(43) మృతి చెందారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌కుమార్‌. ఉదయ్‌కుమార్‌కి గుండెపోటు రావడంతో ఈరోజు (శుక్రవారం) ఉదయమే ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబునాయుడు తన కార్యక్రమాలను పక్కనపెట్టి హుటా హుటిన హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వున్న నందమూరి కుటుంబ సభ్యులు కేర్ ఆస్పత్రికి వెళ్ళారు.