జగన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీడీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా సీఎంను నడిరోడ్డుపై కాల్చిచంపాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ఫిర్యాదు చేయాలని టీడీపీ భావించింది.. అందులో భాగంగా ఎంపీలు రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి సీఈసీని కలిసి ఫిర్యాదును అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చి చంపాలని ప్రతిపక్షనేత వ్యాఖ్యానించడం, జడ్ కేటగిరీ ఉన్న వ్యక్తికి సంబంధించిన వాహనాన్ని అడ్డుకోవడంపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని..అలాగే సాక్షి పత్రికలో వచ్చే పెయిడ్ న్యూస్‌ను ఎన్నికల ఖర్చు కిందే లెక్కగట్టాలని కోరినట్లు తెలిపారు.