బాబాయ్ ని చంపిన వారిని ఎందుకు పట్టుకోలేదు జగన్?

 

బాబాయ్ ని చంపిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని సీఎం జగన్ ను ప్రశ్నించారు మాజీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఏం చేశారంటూ నిలదీశారు. ఇంటి దొంగల పనేనని చెప్పినందుకే ఎస్పీని ట్రాన్స్ ఫర్ చేశారని విమర్శించారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.కోర్టుకు వెళ్లి విచారణ చేయకుండా ఈ అంశం గురించి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మాట్లాడకుండా ఉండాలని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. ఆరు నెలలు అవుతున్నా కేసు విషయం ఏమి చేశారంటూ బాబు నిలదీసారు. కడప జిల్లా గడ్డ మీద కుర్చొని అడుగుతున్నానని.. సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా అంటూ మండిపడ్డారు. మీరు ఇంత నీచంగా ప్రవర్తిస్తూ.. సొంత బాబాయిని చంపిన ఇంటి దొంగలను పట్టుకోలేని వారు.. మా వాళ్ల పై తప్పుడు కేసులు పెట్టి హెరాస్ మెంట్ చేస్తారా అని జగన్ సర్కార్ పై బాబు భగ్గుమన్నారు. ధర్మం అనేది ఉంటుందని చివరకు ధర్మమే జయిస్తుంది కానీ ఆధర్మం జయించదని.. మేము ధర్మం కోసం పోరాడుతున్నమని.. మన పోరాటం ధర్మపోరాటం అని బాబు కడప జిల్లా పర్యటన సందర్బంగా వెల్లడించారు.