కోడెల మరణం.. ప్రముఖుల సంతాపం

 

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. కోడెల మరణవార్త విని పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు.. కోడెల మృతి పట్ల వారు సంతాపం ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ‘‘కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి టీడీపీలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

 

 

కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువడింది.

 

 

కోడెల మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.' అని ట్వీట్ చేశారు.

 

 

కోడెల మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువడింది.