నేను సీఎంని అడుగుతున్న... మోడీ సమాధానం చెప్పాలి...!
posted on Mar 28, 2018 4:53PM
ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్మానం చర్చకు మాత్రం రాకుండా సభ వాయిదాల మీద వాయిదాల పడుతూనే ఉంది. అయితే దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తుంటే మరోవైపు ఉభయ సభలను పదే పదే వాయిదాలు వేస్తున్నారని.... రాజీలేని పోరాటం చేసి హక్కులను కాపాడుకుందామని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అయిందని ఇప్పటికీ బడ్జెట్ లోటును పూడ్చడం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరానికి సంబంధించి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పామని, రాజధాని కోసం ఇచ్చిన రూ.1500 కోట్లకు యూసీలు ఇచ్చామని తెలిపారు. యూసీలు ఇస్తే అవి తప్పు అని ప్రచారం చేస్తున్నారని, మరి కొందరు బీజేపీ నేతలు అసలు యూసీలే పంపలేదని ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. తాను ఈ రోజు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా అడుగుతున్నానని, దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని నిలదీశారు. మరి చంద్రబాబు ప్రశ్నకు మోడీ ఎలా సమాధానం చెబుతారో చూద్దాం...