భువనేశ్వరిపై చంద్రబాబు ప్రశంసలు....

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సతీమణి భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఈరోజు ‘హెరిటేజ్’ ఫ్యాక్టరీ సందర్శించడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు. దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆయన ఈ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయడు మాట్లాడుతూ, తన సతీమణి భువనేశ్వరి వల్లే ‘హెరిటేజ్’ ఈరోజు ఈ స్థాయికి చేరిందని ప్రశంసించారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు నడవాలని, సామాజిక బాధ్యతతో కష్టపడి పని చేస్తే అవార్డులు వస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. అంతకుముందు, ఇంధన పొదుపులో జాతీయ అవార్డుల సాధనకు కృషి చేసిన ‘హెరిటేజ్’ ఉద్యోగులను చంద్రబాబు అభినందించారు.