అలా చేయడమే నా లక్ష్యం..

 

ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఫుల్ జోష్ లో ఉన్నసంగతి తెలిసిందే. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కూడా తమదే గెలుపని ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో ఎడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా తాము గెలవాలని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెట్లంగిలో 'ఇంటింటికీ టీడీపీ'ని ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడుతూ... మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరును పూర్తి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయడమే తన లక్ష్యమని, అందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాల్సి వుంటుందని వ్యాఖ్యానించారు.  అభివృద్ధికి అడ్డు తగులుతున్న విపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతున్నారని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ముందడుగు వేయాలని కోరారు. 2014 ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని.. ఇటీవలి నంద్యాల ఎన్నికల్లో 16 శాతం ఓట్లను తెచ్చుకున్నామని, కాకినాడలోనూ ఘన విజయం సాధించామని అన్నారు.