తూర్పు గోదావరిలోకి బాబు ప్రవేశం

 

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తన పాదయాత్ర ముగించుకొని ఈ రోజు కొవ్వూరు-రాజమండ్రి మధ్యగల రెయిల్-కం-రోడ్ బ్రిడ్జ్ మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు, కార్యకర్తలు బ్రిడ్జ్ వద్ద ఉదయం నుండే ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ఈ రోజు రాత్రికి రాజమండ్రీలో బస చేసి రేపటి నుండి తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తారు. గత ఆరు నెలలుగా నిర్వివిరామంగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు వచ్చే నెల 19వ తేదీన తన పాదయత్ర కు ముగింపు పలికి, తన పుట్టిన రోజు నాడు అంటే వచ్చే నెల 20న విశాఖపట్నంలో పార్టీ నిర్వహించబోయే ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్న తరువాత ఆయన హైదరాబాదు తిరిగి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల విశ్రాంతి తీసుకొన్న తరువాత మళ్ళీ మిగిలిన రెండు జిల్లాలు-విజయనగరం మరియు శ్రీకాకుళం లను బస్సులో పర్యటిస్తారు.