కేవీపీ పాత్రపై సిబీఐ దర్యాప్తు

 

జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు పాత్రపై సిబీఐ కూపీ లాగుతోంది. వై.ఎస్. హయాంలో ప్రభుత్వ నిర్ణయాల్లో కేవీపీ హస్తం కూడా ఉండవచ్చని సిబీఐ అనుమానిస్తుంది. జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ కేసుల దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మంత్రులు, ఐఏఎస్ ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుజ్ఞ్ది వివరాలు తీసుకున్న సిబీఐ కేవీపీ గురించి అధికారిక సమాచారం కోరడం ఇదే ప్రథమం. మొదటిసారి వై.ఎస్. ప్రభుత్వం ఏర్పడినప్పుడు వై.ఎస్. కేవీపీణి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సలహాదారుగా ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించారు. వై.ఎస్. సమక్షంలో జరిగే కీలక సమావేశాల్లో ఆయన కూడా పాల్గొనేవారు. ఎమ్మార్ విల్లాల విక్రయాల వ్యవహారంపై కేవీపీని పిలిచి విచారించిన సిబీఐ తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులోనూ దృష్టి సారించి కేవీపీకి సంబంధించిన పూర్తీ సమాచారాన్ని సిబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సిబీఐ అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధపడుతోంది.