మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు!!

 

ఏపీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో మంత్రి బొత్సకు నోటీసులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని బొత్సను సీబీఐ కోర్టు ఆదేశించింది. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సాక్షిగా ఉన్నారు.