బుట్టా రేణుకపై రోజా స్పందన...


కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే బుట్టా రేణుక పార్టీ మారిన నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ నేతలు ఆమెపై  మండిపడుతుండగా.. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోడా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నట్టు రేణుక చెబుతున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ నుంచి రేణుకను ఎవరూ సస్పెండ్ చేయలేదని, సానుభూతి కోసం ఆమే అలా ప్రచారం చేసుకుంటున్నారని రోజా అన్నారు. కాగా జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న బుట్టా రేణుక ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.