జోస్యం చెప్తున్న బుద్ధా వెంకన్న!!!

 

టీడీపీ పార్టీ ప్రజలకు, పార్టీ బలోపేతానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన గ్రామదర్శిని , గ్రామవికాసం  కార్యక్రమాల  ప్రచారంలో నిమగ్నమయ్యారు ఆ పార్టీ నేతలు. ఈ రోజు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ప్రజలలోకి వెళ్లి సమస్యలు తీర్చటం తమ పార్టీకే సాధ్యమయ్యిందని తెలిపారు. టీడీపీ పార్టీ కార్యకర్తల  సంక్షేమానికి ప్రజల జీవన ప్రమాణాలు పెంచటానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని, తమ నాయకుడే తమకు స్ఫూర్తి అని సమావేశంలో పేర్కొన్నారు.