ప్రపంచంలోనే తొలిసారి ... భారత్ కే సాధ్యం

 

నీటిలోపల సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైల్ ని ప్రయోగించడం ప్రపంచంలోనే తొలిసారి. భారత్ - రష్యా దేశాల సంయుక్తంగా అభివృద్ధి చేసిన 290కిలోమీటర్ల పరిధిని చేరుకునే  బ్రహ్మోస్ క్షిపిణిని విశాఖ తీరంలోని సబ్ మెరైన్ నుంచి బుధవారం విజయవంతంగా ప్రయోగించి పరిశీలించారు. బ్రహ్మోస్ క్షిపిణి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ సిఈవో మాట్లాడుతూ వ్యూహం రచించిన యుద్ధ వాతావరణంలో భాగంగా బంగాళాఖాతం జలాల్లోని సబ్ మెరైన్ నుండి ఉదయం 9-30నిముషాలకు బ్రహ్మోస్ క్షిపిణి దూసుకెళ్ళింది. 'ఎస్' ఆకారంలో విన్యాసం చేస్తూ నీటికి ఒక మీటర్ ఎత్తులో ప్రయాణించి లక్షిత నౌకను ధ్వంసం చేసింది. వర్టికల్ లాంచ్ కాన్ఫిగరేషన్ లో సబ్ మెరైన్లలో అమర్చడానికి బ్రహ్మోస్ క్షిపిణి సిద్ధంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది, ఈ ప్రయోగంలో క్షిపిని పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.