పవన్ ని నమ్మలేం..!!

రాజకీయ నాయకుల మాటలు ప్రజలు నమ్ముతున్నారో లేదో తెలీదు కాని.. రాజకీయ నాయకులు మాత్రం ఒకరి మాటలు ఒకరు నమ్మట్లేదు.. తాజాగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, పవన్ మాటలు నమ్మలేమని అన్నారు.

 

 

'రైల్వే జోన్‌ కోసం ప్రజలంతా రోడ్డెక్కాల్సిన అవసరం లేదు.. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ విశాఖ రండి.. మనం ముగ్గురం పట్టాలపై కూర్చుని రైళ్లను ఆపు దాం.. జోన్‌ ఎందుకు ఇవ్వరో చూద్దాం' అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.. అయితే ఈ విషయంపై స్పందించిన బొత్స.. పవన్ మాటలు నమ్మలేమని.. ప్రత్యేక హోదా డిమాండ్‌తో పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను దేశమంతా తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పిన పవన్‌, తీరా అవిశ్వాసం పెట్టిన తర్వాత కనిపించకుండా పోయిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు.