బోనాలకు అంకురార్పణ

జంటనగరాల్లో అత్యంత వైభవంగా జరిగే బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువై ఉన్న మహాంకాళీ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి బోనం సమర్పించింది. ప్రభుత్వం తరపున మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌లు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు తొట్టెల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వేడుకల కోసం రూ.10 కోట్లు కేటాయించిందని..పండుగలను ప్రజలంతా మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు.