ప్రశాంతంగా జరుగుతున్న ముంబై మున్సిపల్ ఎన్నికలు

బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కార్పోరేషన్‌లో మొత్తం 227 డివిజన్లు ఉన్నాయి. వీటి కోసం 2275 మంది బరిలో నిలిచారు. మొత్తం 91 లక్షల 80 వేల 491 మంది ఓటర్లు తమ ఓటహక్కును వినియోగించుకోనున్నారు..ఇందుకోసం నగరవ్యాప్తంగా 7304 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని..అందరూ ఓటేయాలని సూచించారు. ముంబైతో పాటుగా మరో తొమ్మిది మున్సిపాలిటీల్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి.