Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీఆర్ఎస్ లోకి రాజాసింగ్..?
posted on: Dec 4, 2015 9:47AM

తెలంగాణలో బీజేపీలో ఉన్న విబేధాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్, ఆపార్టీ ఆధ్యక్షుడు కిషన్ రెడ్డిపై విమర్శలు చేయడం.. కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షపదవి నుండి తొలగించాలి అని ఆరోపిండం.. కిషన్ రెడ్డి వల్లే పార్టీ ఎదగడంలేదు అని అనడంతో.. ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అయితే ఇప్పుడు రాజాసింగ్ చేసిన ఆరోపణలు గురించి బీజేపీ పెద్దలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే..టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిగిన తర్వాతే.. కిషన్పై ఆయన బహిరంగ విమర్శలకు దిగారని ఓ అంచనాకొచ్చారు. ఎందుకంటే గ్రేటర్, స్థానిక ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించి.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్నను తన పార్టీలోకి చేరేవిధంగా చేసింది. అయితే వీరిద్దరు చేరడానికి ఒక రెండు రోజుల ముందే రాజాసింగ్ కిషన్ రెడ్డిపై పడ్డారని.. అంటే వారితో మంతనాలు జరిపిన తరువాతే కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారని పార్టీ నేతలు అనుకుంటున్నారు. దీంతో రాజాసింగ్ టీఆర్ఎస్ పార్టీలోకి వెళతారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


.jpg)


